విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా సంతాన ప్రాప్తిరస్తు. ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్ బ్యానర్స్పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా ఏబీసీడీ సినిమా, రాజ్ తరుణ్ తో ‘అహ నా పెళ్లంట’ అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా టీజర్ను స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ “టీజర్ చాలా బాగుంది. ‘సంతాన ప్రాప్తిరస్తు’ మంచి ఎంటర్టైనింగ్ మూవీలా అనిపిస్తోంది. అన్ని సీన్స్ నవ్వించాయి. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా”అని అన్నారు.
యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -