వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో చాలా కాలం తర్వాత ఇడి కీలక ఆదేశాలు జారీ చేసింది. దాల్మియా సిమెంట్స్ కు చెందిన మొత్తంగా రూ. 793 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లాలోని సున్నపురాయి గనుల తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని గతంలో సిబిఐ చార్జిషీటు దాఖలు చేసింది. దీనిపై 2013 లో సిబిఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ ఆధారంగా ఇడి కేసులు పెట్టింది. ఈ వ్యవహారంలో మొత్తం రూ. 150 కోట్ల మేర జగన్ లబ్ధి పొందారని సిబిఐ తేల్చింది. సిబిఐ చార్జ్ షీట్ ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందని ఇడి తేల్చి ఇప్పుడు ఆస్తులు జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సిబిఐ చార్జ్షీట్ ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందని ఇడి తేల్చి ఇప్పుడు ఆస్తులు జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జగన్ రూ.150 కోట్ల లబ్ధిని షేర్లు, హవాలా రూపంలో నగదు పొందినట్లు ఇడి గుర్తించింది. రూ.95కోట్లు రఘురాం సిమెంట్స్లో షేర్లు పొందారు. ఇది తర్వాత భారతి సిమెంట్స్ గా మారింది. రూ.55కోట్లు హవాలా రూపంలో డబ్బు ఇచ్చినట్లు గుర్తించారు.
కడప జిల్లాలోని సుమారు 417 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న సున్నపురాయి గనులను దాల్మియా సిమెంట్స్ సంస్థకు అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వ కాలంలో లీజుగా మంజూరు చేశారు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో దాల్మియా సిమెంట్స్ కేసు కీలకమైనది. కడప జిల్లాలో దాల్మియా సిమెంట్స్కు 417 హెక్టార్ల భూమి కేటాయించారు. ఇందులో సున్నపు రాయి ఉంటుంది. ఈ భూములు కేటాయించినందుకు జగన్కు సంబం ధించిన సాక్షి మీడియా గ్రూప్ , ఇతర సంస్థలలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు సిబిఐ కేసు పెట్టింది. దాల్మియా సిమెం ట్స్ నుండి వచ్చిన పెట్టుబడులు అక్రమ ఆదాయంగా ఇడి నిర్ణయించింది. గతంలో దాల్మియా సిమెంట్స్కు చెందిన పునీత్ దాల్మియా తమపై ఉన్న కేసును కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎప్పుడూ విచారణకు హాజరు కాలేదు. 2021లో ఈ పిటిషన్ విచారణ సందర్భంగా వాయిదా కోరినందుకు హైకోర్టు రోజుకు రూ. 50,000 ఖర్చులు చెల్లించాలని పునీత్ దాల్మియాను ఆదేశించింది. ఉద్దేశ పూర్వకంగా విచారణను ఆలస్యం చేస్తున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
జగన్ అక్రమాస్తుల కేసులన్నీ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు , సిబిఐ కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. సుప్రీంకోర్టు విచారణను వేగవంతం చేయాలని ఆదేశించినప్పటికీ చురుకుగా ముందుకు సాగడం లేదు. అయితే సిబిఐ చార్జిషీటు దాఖలు చేసిన 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇడి ఆస్తులు జప్తు చేయడం చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో కేసుల దర్యాప్తులు ఆగిపో యాయి. విదేశాల నుంచి సమాచారం కోసం దర్యాప్తు సంస్థలు ప్రయత్నించాయని చెబుతారు. ఇటీవలి కాలంలో కోర్టుల్లో ట్రయల్ కూడా జర గడం లేదు. అనూహ్యంగా ఇడి నిర్మయం తీసుకోవడంతో ఇక నుంచి కేసుల విచారణ ఊపందుకుంటుందని పలువురు భావిస్తున్నారు.