- Advertisement -
ఎపిలోని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసిపి అధినేత జగన్ ఇంటి ముందు జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. సిసి ఫుటేజ్ ఇవ్వాలని రెండ్రోజుల క్రితం ఆ పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తికి నోటీసులు ఇచ్చారు. తమ వద్ద ఎలాంటి సిసిటివి ఫుటేజ్ లేదని నారాయణమూర్తి తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందని పోలీసులు మంగళవారం మరోసారి నోటీసులు ఇచ్చారు. వ్యక్తిగతంగా హాజరై సిసి కెమెరాలు వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
- Advertisement -