- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్లో గడచిన 24గంటల్లో 69,095 సాంపిల్స్ పరీక్షించగా.. 3,503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,89,553కు చేరింది. ప్రస్తుతం ఎపిలో 33,396 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కొత్తగా 5,144 మంది కోలుకోగా మొత్తం కోలుకున్నవారి సంఖ్య 7,49,676 మంది ఉన్నారు. గత 24 గంటల్లో కరోనాతో కొత్తగా 28 మంది మృతి చెందగా..మొత్తం మరణాల సంఖ్య 6,481కి చేరింది.
3503 New Corona Cases Registered in AP
- Advertisement -